20-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 20: హైదరాబాద్ నగరంలో పట్టపగలు భారీ చోరనీ జరిగింది. మేడ్చల్ కేంద్రంలో పట్టపగలే పెద్ద దొంగతనం జరిగింది. బంగారం షాపులోకి వచ్చిన దోపిడీ దొంగలు.. కత్తితో షాపు ఓనర్ను పొడిచి.. బంగారం దోచుకుని.. బైక్ పై వెళ్లిపోయారు.. సవిూపంలోనే పోలీస్ స్టేషన్ సైతం ఉండటం మరింత సంచలనంగా మారింది. గురువారం మధ్యాహ్నం మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు ఆనుకొని ఉన్న జగదాంబ జ్యూవెలరీ షాపుకు ఇద్దరు వచ్చారు. ఇందులో ఒకరు మాస్క్, మరొకరు బురఖాను ధరించి షాపులోకి వచ్చారు. బంగారం కొనే విధంగా నటించిన బురఖా దొంగ తన దగ్గర ఉన్న కత్తితో షాప్ ఓనర్ శేషారంపై దాడి చేసి దొరికినంత బంగారాన్ని ఎత్తికెళ్లారు. వెంటనే షాప్ ఓనర్ కేకలు వేయడంతో దొంగలు బైక్ పై అక్కడినుండి పరారయ్యారు.
పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ ను సైతం లెక్కచేయకుండా బంగారం దోపిడీ చేసి పారిపోయారు దొంగలు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలతో రికార్డు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను అంతరాష్ట్ర ముఠాగా గుర్తించారు. బంగారం ఎంత పోయిందో తెలియాల్సి ఉంది. ఇద్దరు దొంగలు క్షణాల్లో ఓ బంగారం షాపులోకి చొరబడి ఉన్నది మొత్తం ఊడ్చుకుపోయారు. మేడ్చల్లో ఉన్న జగదాంబ బంగారం షాపునకు ఇద్దరు దుండగులు బుర్కా వేసుకుని వచ్చారు. కత్తితో షాపు యజమాని మెడ కింద పొడిచి బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.
ఇద్దరు వ్యక్తులు ఓ పల్సర్ బైకుపై నగల దుకాణానికి వచ్చారు. ఆ బైకును షాపు ముందే పార్క్ చేసి ఉంచి.. ఇద్దరూ లోనికి వెళ్లారు. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు బుర్ఖా వేసుకోగా.. మరొక దొంగ సాధారణ దుస్తుల్లోనే ఉన్నాడు. షాపులోనికి ప్రవేశించిన కొన్ని క్షణాల వ్యవధిలోనే తొలుత అక్కడున్న సేల్స్ పర్సన్ని బుర్ఖా వేసుకున్న వ్యక్తి బెదిరించారు. అతను వెంటనే లోనికి వెళ్లిపోగా.. ఓనర్ ను బెదిరించి వారు తెచ్చుకున్న బ్యాగుల్లో కొన్ని బంగారు వస్తువులను దోచుకొని బయటికి పరుగులు తీశారు. అప్పటికే ఓనర్ పై బుర్ఖా వేసుకున్న వ్యక్తి కత్తితో దాడి చేశాడు. బయటకు పరుగున వచ్చి బైక్ పై పారిపోతున్న వారిపై ఓ ఇనుప స్టూలుతో సేల్స్ మేన్ దాడి చేశాడు. అయినా వారు బైక్ పై ఉడాయించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.